Lokesh Kanagaraj : ఇక దృష్టి అంతా ఈ సినిమాపైనే!

ABN , First Publish Date - 2023-10-31T16:43:17+05:30 IST

ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌లో లోకేష్‌ కనగరాజు ఒకరు. తాజాగా ‘లియో’తో సూపర్‌సక్సెస్‌ అందుకున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ రజనీకాంత్‌తో చేయనున్నారు. సోమవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఓ ఆరు నెలలపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

Lokesh Kanagaraj : ఇక దృష్టి అంతా ఈ సినిమాపైనే!

ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌లో లోకేష్‌ కనగరాజు (lokesh kanagaraj) ఒకరు. తాజాగా ‘లియో’(Leo) తో సూపర్‌సక్సెస్‌ అందుకున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ రజనీకాంత్‌తో చేయనున్నారు. సోమవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఓ ఆరు నెలలపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ సమయం అంతా రజనీకాంత సినిమాకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘లియో’ సినిమాకు కావాలనే కొందరు నెగెటివ్‌గా రివ్యూలు ఇచ్చారు. నెగటివ్‌ ప్రచారం చేశారు. జర్నలిస్ట్‌లకు నేను కృతజ్ఞలు చెప్పాలి. నేనీ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల ఎంతగా ఆదరించారో జర్నలిస్ట్‌లు అంతే ఆదరించారు. నా ఎదుగుదలకు వారూ కారణమే! పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ వాళ్లు కావాలని ‘లియో’ బాగోలేదని ప్రచారం చేశారు. కానీ సినిమా సక్సెస్‌ అందరికీ సమాధానం చెప్పింది. కొంతకాలం సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా ‘తలైవా171’ (Thalaiva 171)మీదే. ఈ సినిమాలో రజనీకాంత్‌ (Rajanikanth) నెగెటివ్‌ షేడ్‌ హైలైట్‌ కానుంది. వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని అన్నారు. సినిమా పూర్తయ్యాకే విడుదల తేదీని ప్రకటించాలని లోకేష్‌ భావిస్తున్నారట.

ప్రస్తుతం రజనీకాంత్‌ 170వ సినిమాతో బిజీగా ఉన్నారు. టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల అమితాబ్‌ సెట్‌లో జాయిన అయ్యారు.

Updated Date - 2023-10-31T16:43:17+05:30 IST