Bro Song: తిరుపతిలో సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల!

ABN , First Publish Date - 2023-07-15T16:49:56+05:30 IST

పవన్‌ కళ్యాణ్‌-సాయిధరమ్‌ తేజ్‌ కలిసి ‘నటిస్తోన్న చిత్రం ‘బో’. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీసంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ‘బ్రో’ నుంచి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది.

Bro Song: తిరుపతిలో  సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల!

పవన్‌ కళ్యాణ్‌-సాయిధరమ్‌ (Pawan Kalyan- Sai dharam tej)తేజ్‌ కలిసి ‘నటిస్తోన్న చిత్రం ‘బో’(Bro) జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీసంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు,, టీజర్‌, మొదటి పాట ‘మై డియర్‌ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన రాగా, శనివారం ‘బ్రో’ నుంచి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది. ఎస్‌ థమన్‌ సంగీతంలో ప్రణతితో కలిసి ఆయనే ఈ పాట పాడారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ‘జాణవులే నెరజాణవులే.. నా జాన్‌ నువ్వులే జాణవులే.. వాణివిలే అలివేణివిలే.. నా మూన్‌ నువ్వులే జాణవులే’ అంటూ సాగే పాటను తేజ్‌, కేతిక శర్మలపై ఈ పాటను చిత్రీకరించారు. తిరుపతిలో జయశ్యామ్‌ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. సాయుధరమ్‌ తేజ్‌, సముద్రఖని, ఎన్‌.వి. ప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2.jpg

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘నా గురువు, మేనమామ పవన్‌ కళ్యాణ్‌ గారి ప్రేమ, ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీ ప్రేమ, అభిమానం నాపై ఎప్పుడూ ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను అంటే దేవుడి దయతోనే సాధ్యమైంది. జూలై 28 న థియేటర్లలో గోల చేయడానికి సిద్థంగా ఉండండి’’ అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. ‘సాయితేజ్‌తో పనంటే ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. కల్యాణ్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ సినిమాలో ఆయన దేవుడిలా దిగి వస్తారు. నా జీవితంలో మరిచిపోలేని సినిమా ఇది’’ అని అన్నారు.

Updated Date - 2023-07-15T17:12:43+05:30 IST