Bro: కనకదుర్గమ్మను దర్శించుకున్న ‘బ్రో' టీమ్‌

ABN , First Publish Date - 2023-08-01T11:14:32+05:30 IST

‘బ్రో’ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. చిత్ర కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సముద్రఖని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bro: కనకదుర్గమ్మను దర్శించుకున్న ‘బ్రో' టీమ్‌

‘బ్రో’ (Bro)సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ (Kanakadurga temple) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. చిత్ర కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌(Sai dharam tej) , దర్శకుడు సముద్రఖని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవాలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని చిత్ర బృందానికి అందజేశారు.

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో’ చిత్రం గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్రివిక్రమ్‌ మాటలు-స్ర్కీన్‌ప్లే అందించారు. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.జీ స్టూడియో భాగస్వామ్యంతో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో వంద కోట్ల గ్రాస్‌ రాబట్టింది.

Updated Date - 2023-08-01T11:15:35+05:30 IST