Guntur Karam - Meenakshi: మొత్తానికి బయటకు చెప్పింది.. లీక్‌ ఇచ్చింది

ABN , First Publish Date - 2023-07-17T11:53:56+05:30 IST

మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథనాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకెండ్‌ లీడ్‌ చేస్తుందనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి మీనాక్షి ఓ లీక్‌ వదిలింది.

Guntur Karam - Meenakshi: మొత్తానికి బయటకు చెప్పింది.. లీక్‌ ఇచ్చింది

మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Karam). శ్రీలీల కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi CHowdary) సెకెండ్‌ లీడ్‌ చేస్తుందనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి మీనాక్షి ఓ లీక్‌ వదిలింది. ‘హత్య’ (hatya)సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు లీక్‌ చేసింది. సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘‘ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తయింది. మహేశ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. మహేశ్‌తో కలిసి నటిస్తున్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. షూటింగ్‌కు వెళ్లిన మొదటి రోజు, మొదటి సన్నివేశమే మహేశ్‌తో ఉంది. ఆ రోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. త్రివిక్రమ్‌, మహేశ్‌ హిట్‌ కాంబోలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని మీనాక్షి చౌదరి చెప్పింది. (Meenakshi chowdaru leak)

‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ‘హిట్‌ 2’, ‘ఖిలాడి’ చిత్రాల్లో అవకాశాలు అందుకొంది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’లో చేస్తోంది. ఈ చిత్రంలో మొదట పూజా హెగ్డే, శ్రీలీలను నాయుకలుగా ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల పూజా ఈ సినిమా నుంచి తప్పుకొంది. దీంతో శ్రీలీల మెయిన్‌ హీరోయిన్‌ అయింది. రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి అవకాశం అందుకొంది.

Updated Date - 2023-07-17T12:04:24+05:30 IST