Ram Charan: ఉపాసనతో ఇండియా వచ్చి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా....

ABN , First Publish Date - 2023-03-17T14:46:47+05:30 IST

'ఆర్.ఆర్.ఆర్' ప్రచారానికి అమెరికా వెళ్లిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారి ఆస్కార్ అవార్డు అందుకున్నాక ఇండియా తిరిగి వచేసాడు. అయితే ఇప్పుడు వెంటనే రామ్ చరణ్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా...

Ram Charan: ఉపాసనతో ఇండియా వచ్చి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా....

ఆస్కార్ అవార్డు (Oscars95) రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిచిన 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకి వచ్చింది. అమెరికాలో కొన్ని వారాలపాటు వుంది ఆస్కార్ అవార్డుల కోసం కృషి చేసి, ప్రచారం చేసిన ఒక్కొక్కరూ ఇప్పుడు భారత దేశం తిరిగి వచ్చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వచ్చేస్తే, నిన్న రాత్రి దర్శకుడు రాజమౌళి, అతని అన్నయ్య కీరవాణి (MM Keeravani), ఇంకా మిగతా కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసారు.

ramcharanisback1.jpg

ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) అతని భార్య ఉపాసన (Upasana Konidela) తో కూడా ఇండియా వచ్చేసారు. రామ్ చరణ్ ఇండియా కి వచ్చిన వెంటనే, ఇంకో కార్యక్రమం లో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ లో జరిగే ఒక సదస్సులో పాల్గొంటాడు. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా పాల్గొంటారు. అలాగే దేశం లో వున్నా కొంతమంది ప్రముఖులు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాంటి వాళ్ళు కూడా పాల్గొని ఈ సదస్సులో మాట్లాడుతారు.

ramcharanisback2.jpg

అమెరికా నుండి ఇండియా వచ్చిన రామ్ చరణ్ నేరుగా ఈ సదస్సుగా వెళుతున్నాడు. ఇక్కడ అతనికి చక్కని అవసకం దొరికింది మాట్లాడటానికి, అలాగే మిగతా ప్రముఖలని కలవడానికి.

ramcharanisback3.jpg

రామ్ చరణ్ ఈ సదస్సులో మాట్లాడతాడు అని కూడా అంటున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత ఈ సదస్సులో పాల్గొనటం వలన, రామ్ చరణ్ ఆ అవార్డు గురించి కూడా మాట్లాడే అవకాశం వుంది అని చెప్తున్నారు. మరి సినిమా పరిశ్రమ గురించి, ఆ పరిశ్రమకి కావలసిన సదుపాయాలు గురించి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తాడేమో చూడాలి.

Updated Date - 2023-03-17T14:46:49+05:30 IST