Sameera Reddy: మహేశ్ బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ తిరిగెళ్లిపోయిన అందాల భామ

ABN , First Publish Date - 2023-02-04T19:55:25+05:30 IST

‘నరసింహుడు’ (Narasimhudu) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సమీరా రెడ్డి (Sameera Reddy). కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Sameera Reddy: మహేశ్ బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ తిరిగెళ్లిపోయిన అందాల భామ

‘నరసింహుడు’ (Narasimhudu) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సమీరా రెడ్డి (Sameera Reddy). కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ ముంబై భామ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. గతంలో తాను సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మూవీకి ఆడిషన్ ఇచ్చినట్టు చెప్పింది. ఆడిషన్ సరిగ్గా ఇవ్వలేక కన్నీళ్లతో ఇంటికి వెళ్లినట్టు పేర్కొంది.

‘‘నా మొదటి సినిమా ఆడిషన్ 1998లో ఇచ్చాను. అందులో హీరో మహేశ్ బాబు. ఆరోజు నేనెంతో భయపడ్డాను. ఆడిషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్లిపోయాను. డెస్క్ జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఉద్యోగంలోనే రెండేళ్ల పాటు కొనసాగాను. అనంతరం కొన్నాళ్లకు నాకు ధైర్యం వచ్చింది. కెమెరా ముందుకు వచ్చి మొదటి మ్యూజిక్ వీడియో చేశాను’’ అని సమీరా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్ బాబు అభిమానులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ఏ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మహేశ్ బాబు‌తో మీరు యాడ్ అయిన చేయాలి’’ మరో నెటిజన్ తెలిపారు. ఇక సమీరా రెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాలు చేసింది. బాలీవుడ్ నుంచి ఎక్కువగా అవకాశాలు రావడంతో సినిమాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయింది. చివరగా ‘కృష్ణం వందే జగద్గురుం’ లో ఓ సాంగ్‌లో కనిపించింది. వివాహం అనంతరం చిత్రాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.

Updated Date - 2023-02-04T19:55:27+05:30 IST