SSMB29: వైరల్‌ న్యూస్‌... విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ!

ABN , First Publish Date - 2023-04-15T10:16:35+05:30 IST

మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా నటించబోతున్న 29వ చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29)చిత్రంపై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

SSMB29: వైరల్‌ న్యూస్‌... విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ!

మహేశ్‌బాబు (Maheshbabu) హీరోగా నటించబోతున్న 29వ చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29)చిత్రంపై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా (Forest action adventure)ఉండబోతుందని ఇప్పటికే దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. రాజమౌళికి పురాణాలంటే ఇష్టం. తన కథలు వాటిని నుంచి పుట్టుకొస్తాయి. పాత్రలూ అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో హీరో మహేశ్‌ పాత్ర హనుమంతుడు స్ఫూర్తితో రాశారని, బలమైన పాత్ర అని వారం రోజులుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. దీనిపై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. (Vijayendra prasad clarity on mahesh charector)

‘‘రాజమౌళికి రామాయణ, మహాభారత, అమర చిత్ర కథలు, చందమామ కథల నుంచి ప్రేరణ పొందుతాడు. సాహసోపేత కథల్ని, చెడుపై మంచి విజయం గురించి చెప్పాలనుకుంటాడు. తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయి. రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతునట్లు మహేశ్‌బాబు పాత్ర హనుమాన్‌ స్ఫూర్తితో ఉండవు. అలాగే ఏ పౌరాణిక పాత్రతో పోలి ఉండదు. అది ఎవరో పుట్టించిన గాసిప్‌ అంతే’’ అని అన్నారు.

ప్యాన్‌ ఇండియా స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీన్ని మూడు పార్టులుగా దర్శకధీరుడు తెరకెక్కించబోతున్నారని మహేశ్‌ ఫ్యాన్స్‌ పేజీల్లో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-04-15T10:16:36+05:30 IST