Chidambaram: మలయాళ సినిమా టు.. బాలీవుడ్‌!

ABN , Publish Date - Jul 18 , 2024 | 10:57 AM

మలయాళ చిత్రసీమలో ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’తో బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించారు దర్శకుడు చిదంబరం. ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది.

మలయాళ చిత్రసీమలో ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’(Manjummel Boys) తో బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించారు దర్శకుడు చిదంబరం(Chidambaram). ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. ఓ ప్రాంతంలోని వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా యువత నేపథ్యంలో తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకత్వం వహించిన రెండు చిత్రాలకే చిదంబరం దర్శకుడిగా మరో మెట్టెక్కారు. తనేంటో మరోసారి నిరూపించుకునేందుకు హిందీ చిత్రసీమలో అడుగుపెట్టనున్నారు. ఫాంటమ్‌ స్టూడియోస్‌తో (Phantom Studios) కలిసి ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. 

Chidambara,m.jpg
 
ఈ విషయాన్ని ఫాంటమ్‌ స్టూడియోస్‌ (Phantom Studios) ఇన్‌సాగ్రామ్ట్‌ వేదికగా ప్రకటించింది. ‘‘సౌత్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ చిదంబరంతో సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. భాషా పరమైన హద్దులను దాటి కథలను రూపొందించాలనుకుంటున్నాం. ఇందుకు చిదంబరాన్ని హృదయపూర్వకంగా ఫాంటమ్‌ సంస్థలోకి ఆహ్వానిస్తున్నాం. సృజనాత్మకత దర్శకులకు తోడ్పాటునందించే సంస్థ మాది’’అని ఇన్స్టాలో పేర్కొన్నారు. 

Updated Date - Jul 18 , 2024 | 10:58 AM