Pawan Kalyan: సినిమా టికెట్ ధరలపై డిప్యూటీ సీఎంకు పూర్ణా పిక్చర్స్ ఎండీ సలహా..

ABN , Publish Date - Oct 15 , 2024 | 07:53 PM

టాలీవుడ్‌లో ఓటీటీలతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్ణా పిక్చర్స్ ఎండీ చర్చించి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

Pawan Kalyan and Grandhi Viswanath

టాలీవుడ్‌లో ఓటీటీలతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలి. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్‌తో విశ్వనాథ్ భేటీ అయ్యారు. పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని పవన్ కళ్యాణ్‌కి అందజేశారు.

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే


ఈ సందర్భంగా గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ.. “ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోంది. సినిమా రంగాన్ని బతికించడానికి ఫ్లెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫ్లెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారు. చిన్న సినిమాలకు ఈ విధానం వల్ల మంచి కలుగుతుంది. ప్రేక్షకులు కూడా సినిమా హాల్‌కు వస్తారు. దీని వల్ల అన్ని స్థాయిల చిత్రాలకు మేలు కలుగుతుంది” అని వెల్లడించారు.


Deputy-CM.jpg

పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ సూచనలను విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సానుకూలంగా స్పందించి ఈ వివరాలను గౌరవ ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పల్లె పండగ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. మరో వైపు ఆయన చేస్తున్న సినిమాలలోని ‘హరి హర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఓ షెడ్యూల్ షూట్‌ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం జరిగే షెడ్యూల్‌లో పాల్గొంటే చాలు దాదాపు షూటింగ్ పూర్తయినట్లేనని ఇటీవల నిర్మాత ఏఎమ్ రత్నం చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ బ్యాలెన్స్ షూట్‌ని పూర్తి చేయనున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 07:53 PM