Bigg Boss8: ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యింది ఎవరంటే..

ABN , Publish Date - Oct 09 , 2024 | 10:06 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కొత్త, పాత వాళ్లతో గందరగోళంగా తయారైంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాతవారిని తీసుకొచ్చి.. కొత్తగా ట్రై చేశామని బిగ్ బాస్ యజమాన్యం భావిస్తున్నా.. షో మాత్రం ఇంకా చప్పగానే సాగుతోంది. ఇక ఈ సీజన్ ఎపిసోడ్ 38 రివ్యూ విషయానికి వస్తే..

Bigg Boss Telugu Season 8 Episode 38

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu Season 8) కొత్త, పాత వాళ్లతో గందరగోళంగా తయారైంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాత వాళ్లతో బిగ్ బాస్‌ని పైకి లేపాలని ఈ షో యాజమాన్యం చేసిన ప్రయత్నం ఏమంత సక్సెస్ అయినట్లుగా అయితే కనిపించడం లేదు. అవినాష్ కాస్త కామెడీతో ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. ఇంటి సభ్యులలో మిగతా వారంతా మణికంఠ మీద ఫోకస్ పెట్టి వాళ్ల ఆటని వదిలేస్తున్నారు. దీంతో ఎప్పటిలానే మణికంఠే ఫేమస్ అవుతున్నాడు తప్పితే.. ఎవరూ బిగ్ బాస్‌ని పైకి లేపలేకపోతున్నారు. ఇక బిగ్ బాస్‌లో ఆరవ వారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈసారి ఎలిమినేషన్‌కి జరిగిన నామినేషన్‌లో 6 గురు నామినేట్ అయ్యారు. వారెవరంటే..

Also Read- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ.. ప్రయత్నం ఫలిస్తుందా

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిలో ఈసారి ఇద్దరు నామినేట్ అయ్యారు. రాయల్ క్లాన్ సభ్యులు చేసిన నామినేషన్‌లో యష్మీ, సీత, విష్ణు, పృథ్వీ ఉండగా.. ఓజీ క్లాన్‌లోని వారంతా రాయల్ క్లాన్‌లో ఉన్నవారిలో ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. అంతేకాదు, రాయల్ క్లాన్ వద్ద ఉన్న నామినేషన్ షీల్డ్ ఉన్న కంటెస్టెంట్‌ని కనుక నామినేట్ చేస్తే.. ప్రైజ్ మనీ లోంచి రూ. లక్ష కట్ అవుతుందని అనగానే.. రాయల్ క్లాన్ అంతా చర్చించుకుని ఆ షీల్డ్‌ని నయని పావనికి ఇచ్చారు. దీంతో ఓజీ క్లాన్.. నయని పావని జోలికి వెళ్లకుండా.. మెహబూబ్, గంగవ్వలను నామినేట్ చేశారు. దీంతో మొత్తంగా ఆరుగురు ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో నామినేట్ అయ్యారు. మరి వీరిలో సేఫ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే.. ఇంకా 5 రోజులు ఆగాల్సిందే.


Teja.jpg

ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో టేస్టీ తేజ తన నోటిదూలకు తనే తిట్టుకునే ఎపిసోడ్ కాస్త ఎంటర్‌టైన్ చేసిందని చెప్పుకోవాలి. కొత్తగా హౌస్‌లోకి అడుగుపెట్టిన వారు, ఆల్రెడీ హౌస్‌లో ఉన్న వారికి కొన్ని హింట్లు ఇవ్వడం ఈ ఎపిసోడ్ ప్రత్యేకత. యష్మీకి రోహిణి, అవినాష్.. బయట పరిస్థితి చెప్పారు. మరీ ముఖ్యంగా మణికంఠను టార్గెట్ చేయడం ఆపాలని, మాట్లాడే తీరుని మార్చుకోవాలని, అనవసరపు ఎక్స్‌ప్రెషన్స్ ఆపేయాలని చెప్పారు. అలాగే విష్ణు ప్రియకు కూడా ఆట మీద దృష్టి పెట్టాలని, పృథ్వీ వెనకాల తిరగడం మానేయమని హింట్ ఇచ్చారు. అంతా ఆట వదిలేసి మణికంఠపై ముచ్చట్లు పెట్టడం, మణికంఠని టార్గెట్ చేయకుండా, నామినేట్ చేయకుండా వదిలేయాలని, లేదంటే తనపై సింపతీ బాగా పెరుగుతుందంటూ ఇంటి సభ్యులంతా చర్చలకి దిగారు. టేస్టీ తేజాని పెళ్లి చేసుకోవచ్చు కదా.. అంటూ విష్ణు ప్రియకి గంగవ్వ సూచించడం.. విష్ణు ప్రియ తేజాని బకరా చేయడం అనేది కాస్త ఫన్నీ ఎలిమెంట్.

లాస్ట్ సీజన్‌లో ఎలా ఎలిమినేట్ అయ్యావంటూ నయని, సీత మాట్లాడుకునే సీన్‌లో తేజ నోరు జారడంతో నయని ఎమోషనల్ అయ్యింది. తేజ నా మీద రివేంజ్ తీసుకోవడం వల్లే నామినేట్ అయ్యానంటూ నయని చెబితే.. నేను చేసిందే కరెక్టే.. నిన్నే అంతా బండ బూతులు తిట్టారు అంటూ తేజ నోరు జారాడు. దీంతో నయని ఏడ్చేయడంతో.. మళ్లీ తేజ వచ్చి సారీ చెప్పాడు. పక్కకి వెళ్లి తన నోటి దూల గురించి తనే తిట్టుకున్నాడు. ఇలా ఈ ఎపిసోడ్ నడిచింది. అయితే ఒక రెండు మూడు సీన్స్ తప్పితే.. ఈ ఎపిసోడ్‌లో అంతగా ఎంటర్‌టైన్ చేసిన పార్ట్ లేదనే చెప్పుకోవాలి. ఇలా చప్పగా సాగుతున్న ఈ హౌస్‌ని, సీజన్‌ని లేపాలంటే.. బిగ్ బాస్ ఇంకా కొత్తగా ఆలోచించాలి. అలా జరగలేదంటే.. ముందు ముందు మరింతగా ఈ షో డౌన్ అవుతుందనడంలో సందేహమే లేదు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 12:44 PM