Sardar 2: ‘సర్దార్ 2’లో రాశీ ఖన్నా కాదు.. ఆ భామకు ఛాన్స్!

ABN , Publish Date - Aug 03 , 2024 | 08:35 PM

ఇటివలే ‘సర్దార్ 2’ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ ‘సర్దార్ 2’కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. అయితే ఈ సీక్వెల్‌లో మాత్రం హీరోయిన్ మారినట్లుగా మేకర్స్ చేసిన తాజా ప్రకటనతో తెలుస్తోంది. పార్ట్ 1లో రాశీ ఖన్నా నటించగా.. పార్ట్ 2లో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Sardar Movie Still and Malavika Mohanan

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటివలే ‘సర్దార్ 2’ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ ‘సర్దార్ 2’కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. అయితే ఈ సీక్వెల్‌లో మాత్రం హీరోయిన్ మారినట్లుగా మేకర్స్ చేసిన తాజా ప్రకటనతో తెలుస్తోంది.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ

మొదటి పార్ట్‌లో కార్తీ సరసన ఛార్మింగ్ బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటించగా.. ఈ సీక్వెల్‌లో కోలీవుడ్ గ్లామర్ క్వీన్ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan)ను హీరోయిన్‌గా తీసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. రాశీ ఖన్నా కూడా ఉంటుందా? లేదంటే ఆమె స్థానంలోనే మాళవిక మోహనన్‌ను తీసుకుంటున్నారా? అనేది తెలియదు కానీ.. ‘హీరోయిన్ మాళవిక మోహనన్‌కు స్వాగతం’ అంటూ మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం రాశీ ఖన్నా ఏమంత బిజీగా కూడా లేదు. మరెందుకు మాళవికను తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. (Malavika Mohanan in Sardar 2 Movie)


Raashi-Khanna.jpg

‘సర్దార్ 2’ భారీ బడ్జెట్‌తో హ్యూజ్ స్కేల్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య (SJ Suryah) ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం, జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్, రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.. ఇలా అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈ సీక్వెల్‌లోనూ ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 09:55 PM