Tovino Thomas: వారి ప్రభావం ఎలా ఉందో తెలియజేశా

ABN , Publish Date - Sep 26 , 2024 | 05:22 PM

మలయాళ చిత్రం ‘మిన్నల్‌ మురళి’తో (Minnal Murali) హీరోగా నిరూపించుకుని ‘2018’ చిత్రంతో సూపర్‌డూపర్‌ హిట్‌ అందుకున్నారు టొవినో థామస్‌

మలయాళ చిత్రం ‘మిన్నల్‌ మురళి’తో (Minnal Murali) హీరోగా నిరూపించుకుని ‘2018’ చిత్రంతో సూపర్‌డూపర్‌ హిట్‌ అందుకున్నారు టొవినో థామస్‌(Tovino Thomas). ఇటీవల ఆయన ‘ఎ.ఆర్‌.ఎం.’ (అజయంతే రంధం మోషణం) చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. టొవినో నటించిన 50వ చిత్రమిది. సినిమా సక్సెస్‌ తర్వాత ఆయన తమిళ హీరోలు సూర్య(Suriya), కార్తిలను (Karthi)కలిశారు. వారిద్దరు అంటే ఎంతో ఇష్టమని, వారిని కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.
‘‘నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎన్నో కలలు కన్న సమయంలో సూర్య, కార్తి నాలో ఎంతగానో స్ఫూర్తి నింపారు. ఈరోజు వారితో ఇలా ఫోటో దిగడం చాలా సంతోషంగా ఉంది. నాపై వారి ప్రభావం ఏ విధంగా ఉందో తెలియజేశా. వారిద్దరినీ ఇలా కలుసుకోవడం.. ఎన్నో విలువైన విషయాలు షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.

కార్తి నటించిన కొత్త చిత్రం ‘మెయ్యజగన్‌’  రిలీజ్‌ అవుతున్న సందర్భంగా చిత్రబృందానికి విషెస్‌ చెప్పారు టొవినో థామస్‌. ‘ఎ.ఆర్‌.ఎం’ సక్సెస్‌ సూర్య, కార్తి అభినందనలు తెలిపారు.  జితిన్‌ లాల్‌ దర్శకత్వంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య  విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

Updated Date - Sep 26 , 2024 | 05:22 PM