Akhil: నేను సైలెంట్‌గా ఉండ‌ను.. ఆమెకు తగిన శాస్తి జరగాలి! మంత్రిపై అఖిల్ ఫైర్‌

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:39 AM

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అఖిల్ మ‌రోసారి రెస్పాండ్‌ అయ్యారు. మంత్రిపై నిప్పులు చెరుగుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు.

konda surekha

గ‌త రెండు రోజులుగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హీరో నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీపై చేసిన విమ‌ర్శ‌లు రెండు తెలుగు రాష్ట్రాలు, టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో సినీ ప‌రిశ్ర‌మ అంతా క‌లిసి వ‌చ్చి ముక్త‌కంఠంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌గా నాగార్జున (Nagarjuna) కొర్టు మెట్లు సైతం ఎక్కారు. అప్ప‌టికే మంత్రి సురేఖ కూడా దిగి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో పాటు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంది. ఈ ఇష్యూపై అక్కినేని అఖిల్ (Akhil Akkineni) మ‌రోసారి రెస్పాండ్‌ అయ్యారు. మంత్రిపై నిప్పులు చెరుగుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఏముందంటే.


WhatsApp Image 2024-10-04 at 10.41.42 AM.jpeg

కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత మరియు సామాజిక సంక్షేమాన్ని మరచిపోయింది.. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. గౌరవనీయమైన పౌరులు మరియు నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు.. అగౌరవంగా మిగిలిపోయారు. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో.. తన కంటే చాలా ఉన్నతమైన విలువలు మరియు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి తగిన శాస్తి జరగాలి. ఆమె‌ తప్పు క్షమించబడదు.. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు స్దానం లేదు. అంటూ అఖిల్ అక్కినేని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Updated Date - Oct 04 , 2024 | 02:14 PM