Prashanth Varma:‘సింబా ఈజ్‌ కమింగ్‌’.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర పోస్ట్ 

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:03 PM

‘హనుమాన్‌’ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. తెలుగులోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది


‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో భారీ విజయం అందుకున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. తెలుగులోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తాజా ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma)సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. అంతే కాదు ఆ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్‌ పెంచుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రేక్షకులు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్‌ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వరుస సినిమాలు వస్తాయని ఇటీవల తెలిపారు. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ.. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ  భావిస్తున్నారు. సెప్టెంబర్‌ 6న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇటీవల ప్రశాంత్‌వర్మ పెట్టిన మరో పోస్ట్‌ కూడా సోషల్‌ మీడొయాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ఫొటో షేర్‌ చేస్తూ.. ‘ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా’ అని రాశారు. దీని వెనక ఉన్న కథేంటని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ మధ్యనే నందమూరి మోక్షజ్ఞ ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ ఫంక్షన్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో  అవి తెగ వైరల్‌ అవుతోన్నాయి.

Updated Date - Sep 03 , 2024 | 05:04 PM