Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి ఏం చేశాడంటే..

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:41 AM

ఒకప్పుడు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు. కానీ.. ఇప్పుడు ఆయనకు హీరోలే దొరకట్లేదట.. ప్రస్తుతం ఆయన ఓ యంగ్ హీరోకి స్టోరీ నేరేట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేరు పూరి జగన్నాధ్ (Puri Jagannadh) . ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాప్స్‌తో సతమతవుతున్నాడు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పూరికి ఇప్పుడేమైందని చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు రాజమౌళి తండ్రి, రచయిత విజేంద్రప్రసాద్.. పూరి‌లా పనిచేయాలి, రాయాలి అని ఎంతో తాపత్రయ పడేవాడు. ఇప్పుడు ఆయన రాతల్లో లోపమో లేదా నయా జెనరేషన్‌కి ఆయన సినిమాలు ఎక్కట్లేదేమో తెలీదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు. కానీ.. ఇప్పుడు ఆయనకు హీరోలే దొరకట్లేదట.. ప్రస్తుతం ఆయన ఓ యంగ్ హీరోకి స్టోరీ నేరేట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..


విజయ్ దేవరకొండ 'లైగర్' ఉస్తాద్ రామ్ పోతినేని ' డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో చతికిలపడ్డ పడ్డ పూరి ఈ సారి గట్టిగ బౌన్స్ బ్యాక్ అవుదామనుకుంటున్నాడట. వాస్తవానికి లైగర్ సినిమా తర్వాత ఆయన విజయ్‌తోనే 'జనగణమన' ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. లైగర్ డిజాస్టర్ తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'జనగణమన' మొదట్లో మహేష్ బాబుతో తీయాలని ప్లాన్ చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ఈ డైరెక్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తీసి మరింతా బొక్కాబోర్లాపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ యంగ్ హీరోకి స్టోరీ నేరేట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ హీరో ఎవరు అనేది అఫీషయల్‌గా ప్రకటించే వరకు తెలీదు. పూరి అభిమానులైతే శర్వానంద్, నితిన్, నాని పేర్లను పరిశీలిస్తుండగా ట్రోలర్స్ మాత్రం యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లేదా ఆకాష్ పూరి అంటూ రెచ్చిపోతున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 11:41 AM