Rashmika Mandanna: నేను ఏం చేశానో నాకే తెలియదు

ABN , Publish Date - Jul 28 , 2024 | 07:50 PM

‘పుష్ప’తో సక్సెస్‌తో నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. కొన్నిరోజుల క్రితం కేరళలో జరిగిన ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో హల్‌చల్‌ చేశారు. దాదాపు రెండు వేలమంది అభిమానులు ఆమె కోసం తరలివచ్చారు.

‘పుష్ప’తో (Pushpa 2) సక్సెస్‌తో నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక (Rashmika Mandanna). కొన్నిరోజుల క్రితం కేరళలో జరిగిన ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో హల్‌చల్‌ చేశారు. దాదాపు రెండు వేలమంది అభిమానులు ఆమె కోసం తరలివచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ఫ్యాన్సను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఓ కార్యక్రమంలో భాగంగా జులై 25న కేరళలోని (Kerala tour) కరునాగపల్లికి వెళ్లా. ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వాళ్లు నాపై చూపించిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయా. అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. వారి అభిమానంతో నా హృదయం నిండిపోయింది. నన్ను ఆరాధిస్తున్నందుకు, కేర్‌ తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇంతమంది ప్రేమ పొందేందుకు ఏం చేశానో తెలియదు. కానీ, సంతోషంగా ఉన్నా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అని రాసుకొచ్చారు. ఈ ఏడాది హిందీలో ‘యానిమల్‌’తో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉంది. ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘సికందర్‌’, ‘కుబేరా’తోపాటు లక్ష్మణ్‌ ఉతేకర్‌ తెరకెక్కిస్తోన్న బాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 07:50 PM