Rishab Shetty: టాలీవుడ్‌లో రిషబ్ మార్క్

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:50 AM

కన్నడ సినిమా ప్రైడ్‌గా తెరకెక్కిన 'కాంతారా' సినిమాతో జాతీయ అవార్డులను కొల్లగొట్టిన హీరో రిషబ్ శెట్టి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న జై హనుమాన్‌తో పాటు మరో బిగ్ ప్రాజెక్ట్‌లో కీ రోల్ పోషిస్తున్నాడు.

Rishab Shetty

'కాంతారా' (Kantara) సినిమాతో జాతీయ గుర్తింపు పొందిన హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీక్వెల్ 'కాంతారా చాప్టర్ 1' (Kantara chapter 1) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కన్నడ సినిమా ప్రైడ్ గా తెరకెక్కిన 'కాంతారా' జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. అలాగే 'హనుమాన్' (HanuMan) సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయన హనుమాన్ సినిమాకి సీక్వెల్ 'జై హనుమాన్' భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ అయిన హనుమంతుడి పాత్రల్లో రిషబ్ శెట్టి ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రిషబ్ ఒక ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సినిమాలో మరో రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏదంటే..


ఒక వైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. మరోవైపు చిన్న కథలను ప్రోత్సహిస్తూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ విశిష్ట ఆదరణ సొంతం చేసుకుంటుంది. రీసెంట్ గా మత్తు వదలరా 2 సినిమాతో క్రేజ్ హిట్ అందుకున్న మైత్రి నెక్స్ట్ డిసెంబర్ లో పుష్ప 2తో రానుంది. అయితే కన్నడ సినిమా గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన రిషబ్‌ని ఒక సినిమాలో కాస్ట్ చేసిందట ఈ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం తెలుగులో రాబిన్‌హుడ్, హిందీలో జాట్, తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి భారీ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి రిషబ్‌ని ఏ సినిమాలో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రిషబ్ ఈ సినిమాల్లో చేస్తాడా, లేకపోతే మరో ఫ్రెష్ ప్రాజెక్ట్‌లో చేస్తాడో తెలియదు గాని మైత్రి సినిమాకి అయితే సైన్ చేసేశాడు.

Prabhas: టోక్యోలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోలాహలం



మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హనుమాన్‌ని ప్రైమ్ షో నిర్మాణ సంస్థ నిర్మించగా సెకండ్ పార్ట్‌కి నిర్మాత ఛేంజ్ అయిపోయారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కోట్లు కలెక్షన్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. దైవ భక్తి మెండుగా ఉండే రిషబ్ శెట్టికి ప్రశాంత్ 'జై హనుమాన్' స్టోరీ నేరేట్ చేశాడు. కథ నచ్చిన రిషబ్ హనుమాన్ రోల్ చేయడానికి సానుకూలంగా స్పందించటమే కాక ఓకే కూడా చెప్పేశాడట.

Updated Date - Oct 20 , 2024 | 11:46 AM