Kiladi Kurrollu: గౌతంరాజు త‌న‌యుడు హీరోగా కొత్త చిత్రం ‘కిలాడీ కుర్రోళ్ళు’

ABN , Publish Date - Sep 23 , 2024 | 04:36 PM

గ‌తంలో కృష్ణారావు సూప‌ర్ మార్కెట్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించిన సీనియ‌ర్ న‌టుడు గౌతంరాజు (కుమారుడు కృష్ణంరాజు మ‌ళ్లీ కాస్త గ్యాప్ త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Kriishnam Raju

క‌రోనా స‌మ‌యంలో కృష్ణారావు సూప‌ర్ మార్కెట్ (Krishna Rao Supermarket) అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించిన సీనియ‌ర్ న‌టుడు గౌతంరాజు (Gautam Raju) కుమారుడు కృష్ణంరాజు (Kriishnam Raju) మ‌ళ్లీ కాస్త గ్యాప్ త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం కృష్ణ వరుస చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. చేతిలో నాలుగైదు చిత్రాలు ఉండ‌డంతో పాటు ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్‌ కూడా చేస్తున్నాడని టాక్.

నూతన దర్శకులు, హీరో హీరోయిన్లు ఇలా టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కొత్త త‌రం ర‌య్యిమంటూ సినిమాల‌తో దూసుకెళుతున్నారు. త‌మ ప్ర‌తిభ‌ను చాటుతూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ కమెడియన్ గౌతం రాజు (Gautam Raju) తనయుడు కృష్ణంరాజు (Kriishnam Raju) కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు వ‌చ్చేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు.

Gautam Raju

ఈ క్ర‌మంలోనే కృష్ణ‌ త్వరలో ‘కిలాడీ కుర్రోళ్ళు’ (Kiladi Kurrollu) అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుండ‌గా ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. త్వ‌ర‌లో పాట‌లు రిలీజ్ చేయ‌డంతో పాటు సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Updated Date - Sep 23 , 2024 | 04:36 PM