SITHARA VS PEOPLES MEDIA: జారిపోయి.. చేజిక్కిందా?

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:15 PM

డైరెక్టర్ అనుదీప్, విశ్వక్ సేన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం తిరిగి సితార ఎంటర్‌టెన్మెంట్స్ చేతికి వెళ్లిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ళ్ అవుతున్నాయి.

VS14

జాతిరత్నాలతో పూర్తి ఇండస్ట్రీ‌ని షేక్ చేసిన డైరెక్టర్ అనుదీప్ (ANUDEEP KV). తనకు మాత్రమే సొంతమైన హాస్యంతో అటు సినిమాల్లోనూ, ఇటు నిజ జీవితంలోను ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. కాగా, జాతిరత్నాల తరువాత తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌ (SHIVAKARTHIKEYAN)తో తెరెకెక్కించిన ప్రిన్స్(PRINCE) సినిమా నిరాశపరిచిన విషయం తెలిసిందే.

దీంతో ఈ యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సినీ వర్గాలల్లో ఆసక్తి రేకెత్తింది. అయితే కొన్ని నెలల క్రితం అనుదీప్ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (VISHWAK SEN) కాంబినేషన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY) నిర్మాణంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరెకెక్కనున్నట్లు అఫీషియల్ గానే సమాచారం చక్కర్లు కొట్టింది.

GUZeInkXMAAir06.jpeg

కాగా, ఆ చిత్రం ప్రముఖ నిర్మాత నాగ వంశీ(NAGA VAMSI) సితార ఎంటర్‌టెన్మెంట్స్ (SITHARA ENTERTAINMENTS) నుండి జారిపోయి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ‌కి దక్కిందని సమాచారం. తాజాగా ఈ చిత్రం మళ్ళీ సితార చేతుల్లోకి వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ జానీ, లైలా చిత్రాల షూట్‌లలో బిజీబిజీగా గడుపుతున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 07:01 PM