బాలీవుడ్‌లో ఎక్కువమంది నటీమణులు ఈ పద్థతి ద్వారా బిడ్డల్ని కన్నారు.

ప్రియాంక చోప్రా 30 ఏళ్ల వయసు దాటాకా ఎగ్స్‌ ఫ్రీజింగ్‌ చేసినట్లు  వెల్లడించారు. తల్లి మధు చోప్రా   సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకుంది

ప్రియాంక చోప్రా కంటే ముందు ఏక్తా కపూర్‌ 2019లో సరోగసీ ద్వారా తల్లి అయ్యింది. ఆమె 36 సంవత్సరాల వయస్సులో ఎగ్‌ ఫ్రీజింగ్‌ను అనుసరించింది.

రాఖీ సావంత్ కూడా తల్లి కావడానికి ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేసుకున్నట్లు వెల్లడించింది.

కాజోల్‌ సోదరి తనీషా ముఖర్జీ 39 ఏళ్ల వయసులో ఎగ్స్‌ ఫ్రీజింగ్‌ను అనుసరించింది.

మిస్ వరల్డ్ డయానా హెడెన్ కూడా ఎగ్స్‌ ఫ్రీజింగ్‌ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు.

నటి మోనా సింగ్‌ తన 34 సంవత్సరాల వయస్సులో ఎగ్‌ ఫ్రీజింగ్‌  చేసుకున్నట్లు తెలిపింది.

రిచా చద్దా కూడా ఎగ్ ఫ్రీయింగ్ కి ఓటేశారు. ఈ రోజుల్లో ఈ విధానం చాలా అవసరం అని ఆమె పేర్కొన్నారు

తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.

తాజాగా మెహరీన్‌ సైతం రెండేళ్ల నుంచి ఎంతో ఆలోచించి ఈ విషయంపై అవగాహన పొంది ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేసినట్లు వీడియోను షేర్‌ చేసుకుంది.